ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 26 జిల్లాలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విముఖతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ గా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కొత్త జిల్లాల ప్రక్రియను సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని సీనియర్ నేతలు చంద్రబాబుకు వివరించారు.…
కర్నూలు జిల్లాలోని డోన్ రైల్వేస్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ లో అల్లరి మూకల వ్యక్తులు అరాచకం సృష్టించారు. రాత్రి నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూకలు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న భర్తపై దాడి చేసి మరో మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూక ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేసి గొడవ చేయడంతో.. మహిళ కొడుకును ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో మెట్టుకు మహిళ తల తగిలి మృతి చెందడంతో……
సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు…
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుందని, టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో…
అనంతపురం జిల్లాలో శిల్పకళా క్షేత్రం లేపాక్షి ఆలయ సమీపంలో అతి పురాతనమైన రాతి స్థంభాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి పనులకు చేపట్టిన పనుల్లో రాతి స్థంభాలు వెలుగుచూసాయి. దీంతో ఈ వార్త స్థానికులకు తెలియడంతో రాతి స్థంభాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పురావస్తు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే రహదారి పనుల్లో బయటపడ్డ వాటిని మట్టిలో పూడ్చకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువులో అప్పట్లో ఆలయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నేడు భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేకుకవజామునే భోగి మంటలు వేసి చిన్నాపెద్దా తేడాలేకుండా ఆడిపాడారు. అయితే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వరుణుడు విజృంభిస్తుండడంతో తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలకు బ్రేక్ పడింది.…
ఇటీవల ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసునని, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందని ఆయన అన్నారు. అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దని, వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి…
హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే…
గుంటూరు జిల్లాలో నేడు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యానగర్లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్ స్టార్ హోటల్ను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకుంటారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్కు బయలుదేరి 11గంటలకు హోటల్ ను ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి…
గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. అయితే ప్రమాదానికి గురైన కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చినాన్న కుమారుడు మదన్ మోహన్రెడ్డితో పాటు ఆయన భార్య, కుమార్తెలు ఉన్నారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో మోహన్రెడ్డి భార్త, కుమార్తెలు ఘటన స్థలంలోనే మరణించారు. కారు కాలువలోకి దూసకెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని నీటిలో మునిగిన కారును తీసేలోపే మోహన్రెడ్డి భార్య, కుమార్తెలు…