“రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుందని, టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో అన్న చందంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే దేశ అభివృద్ధి అని, బీజేపీ మాదిరిగా దేశాన్ని రెండుగా విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని ఆయన విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. కన్నీళ్ల రాష్ట్రంగా తెలంగాణ మారిందని, రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే తేలేదని ఆమె అన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలం సోనియాగాంధీ కృషి వల్లనే తెలంగాణ వచ్చిందని, సూర్యాపేట కాంగ్రెస్ సభ్యత నమోదు దేశంలోని ఆదర్శంగా ఉందని, కాంగ్రెస్ విజయాన్ని మోడీ, కేసీఆర్ లు ఆపలేరన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో ఉందని, జీవో 317 ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఆమె వెల్లడించారు.
Also Read
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
తాజావార్తలు
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్