ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సాంప్రదాయ ఫార్మాట్లో 10 వేల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులకే స్మిత్ పెవిలియన్కు చేరాడు. స్మిత్ కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంటాడని ఆసీస్ ఫాన్స్, క్రికెటర్స్ ఆశగా చూస్తున వేళ.. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అతడిని ఔట్ చేశాడు. దాంతో కంగారో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా దీనిపై స్మిత్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆట కంటే పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదన్నారు. టీమిండియా సూపర్స్టార్ సంస్కృతిని వీడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భజ్జీ మరో పోస్ట్ చేశారు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్గా…
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాల్గవ టెస్ట్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరుగుతోంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 26న మొదలు కాగా.. నేడు మూడో రోజు (డిసెంబర్ 28) భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తోంది. లంచ్ సమయానికి భారత జట్టు స్కోరు 244/7 వద్ద కొనసాగుతుంది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఫాలోఆన్ను తప్పించుకోవాలంటే…
నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్లో నెట్స్లో కఠినమైన ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్లు ర్యాన్ టెన్ డోస్చాట్, అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో బుధవారం పెర్త్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్కు మొత్తం జట్టు హాజరయ్యారు. WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్…
భారత్తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును శనివారం వెల్లడించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్ వచ్చాడు. భారత్-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్స్వీనేకు అవకాశం దక్కింది.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి…
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అందరికంటే ముందుగానే కంగారో గడ్డపైకి అడుగుపెట్టారు. నేడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ఆరంభమైన అనధికారిక రెండో టెస్టులో బరిలోకి దిగారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో విఫలమైన రాహుల్ ఈ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. మరలా నిరాశపరిచాడు. ఓపెనర్గా వచ్చి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు యువ ఆటగాడు ధ్రువ్…
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో…
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లు ఆస్ట్రేలియా చేరుకున్నారు.…