Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- ఐదు మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి
- ఫ్లైట్ ఎక్కిన రిషబ్ పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు.
ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాక్టీస్, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే వెళ్లారు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా-ఎతో జరిగే రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఫ్లైట్ ఎక్కేశాడు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో తల్లి సరోజ్ పంత్ కాళ్లు మెక్కి విమానాశ్రయం లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
Also Read: IPL Auction 2025: ఆర్సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి ముంబై చేరుకొని.. ఇండియా క్యాంప్లోని ఆటగాళ్లతో చేరాడు. ముంబైలోని మిగిలిన భారత ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు పయనం అవనున్నాడు. పంత్ న్యూజిలాండ్ సిరీస్లోని ఆరు ఇన్నింగ్స్ల్లో 43.50 సగటుతో 261 పరుగులు చేశాడు. న్యూజిలాండ్పై మూడు అర్ధ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 99. అంతకుముందు బంగ్లాదేశ్పై సెంచరీతో పంత్ టెస్టు క్రికెట్లోకి రే ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాపై రెండు టెస్టుల్లో 161 పరుగులు చేశాడు. దాంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పంత్ కీలక పాత్ర పోషించనున్నాడు.
Rishabh Pant is ready for BGT.
Blessings from mother & we are all set to go ✌️❤️#CricketTwitter #RishabhPant pic.twitter.com/pCxFXr70eY
— Riseup Pant (@riseup_pant17) November 6, 2024
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!