AUS vs IND: హ్యాట్రిక్ కొట్టనివ్వం.. టీమిండియాను నిశ్శబ్దంగా ఉంచుతాం: కమిన్స్
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- టీమిండియాను హ్యాట్రిక్ కొట్టనివ్వం
- రిషబ్ పంత్ డేంజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి మరీ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సవాలే చేశాడు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్ కమిన్స్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం మేం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటివరకు అంతా సాఫీగా సాగుతోంది. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకుంటాం. సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. గత రెండుసార్లు భారత్ ట్రోఫీ గెలవడంతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మా జట్టులోని కొన్ని స్థానాలపై చర్చ సాగుతోంది. డేవిడ్ వార్నర్ను ఎవరితో భర్తీ చేయాలో చూడాలి. మా ఆటగాళ్ల విషయంలో స్పష్టతతో ఉన్నాం. కామెరూన్ గ్రీన్ లేకపోవడం మాత్రం మాకు కాస్త ఇబ్బందే’ అని కమిన్స్ తెలిపాడు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Also Read: AUS vs IND: అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా! ఇలా అయితే కష్టమే
‘మమ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం భారత్కు పెద్ద లోటే. క్రికెట్లో ఇలాంటివి సర్వసాధారణమే. ఒకరి స్థానంలో మరొక ప్లేయర్ సిద్ధంగా ఉంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్లో లేరు. కానీ వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే మేం దృష్టిసారించాం. రిషబ్ పంత్ డేంజర్ అని గతంలోనే చెప్పా. మరోసారి అదే చెబుతున్నా. ఆస్ట్రేలియా అంటే అతడు ఊగిపోతాడు. ఈసారి మాత్రం పంత్కు చెక్ పెడతాం. భారత ప్లేయర్స్ పేస్ పిచ్లపై బాగా ఆడుతున్నారు. పెర్త్, అడిలైడ్లో వారిని నిలువరిస్తామని అనుకుంటున్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడంపై ఇప్పుడే దృష్టి సారించడం లేదు’ అని కమిన్స్ చెప్ప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..