AUS vs IND: ఆస్ట్రేలియా పెద్ద ప్లానింగే.. బుమ్రాను టార్గెట్ చేసిందిగా!
- న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం
- కనీసం నాలుగింటిలో విజయం సాధించాలి
- బుమ్రాను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో పడాల్సిన అవసరం ఎంతో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో భారత్ గత రెండు సిరీస్లను గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడిన బుమ్రా.. ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. 2018లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను (6/33) నమోదు చేశాడు. అందుకే బుమ్రాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తెలిపాడు. టీమిండియాలో బుమ్రా మినహా మిగతా పేసర్ల పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరమే అన్నాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఉండుంటే.. భారత జట్టును అడ్డుకోవడం ఆసీస్కు కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
Also Read
Also Read: Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
జియో సినిమాలో సైమన్ డౌల్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా షెడ్యూలింగ్లోనే స్మార్ట్గా వ్యవహరించినట్లు అనిపిస్తోంది. తమ బ్యాటింగ్ పైనా స్పష్టత మాత్రమే కాదు.. టీమిండియా బ్యాటర్ల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. అయితే ఆస్ట్రేలియాకు జస్ప్రీత్ బుమ్రా నుంచి అతి పెద్ద ముప్పు ఉంది. అందుకే మూడు పిచ్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పెర్త్లో వేడి దెబ్బకు బుమ్రా ఉడికిపోయేలా ప్రణాళికలను రూపొందించినట్లు ఉంది. భారత జట్టులో అతడే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ పెర్త్ పరిస్థితులు అందుకు పెద్దగా సహకరించవు. మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోతే బుమ్రా పైనే ఎక్కువ భారం పడుతుంది. అడిలైడ్, బ్రిస్బేన్లో కూడా పేస్ బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అక్కడ కూడా బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మహమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు తీవ్ర నష్టం’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!