AUS vs IND: ఆస్ట్రేలియా పెద్ద ప్లానింగే.. బుమ్రాను టార్గెట్ చేసిందిగా!
- న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం
- కనీసం నాలుగింటిలో విజయం సాధించాలి
- బుమ్రాను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో పడాల్సిన అవసరం ఎంతో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో భారత్ గత రెండు సిరీస్లను గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడిన బుమ్రా.. ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. 2018లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను (6/33) నమోదు చేశాడు. అందుకే బుమ్రాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తెలిపాడు. టీమిండియాలో బుమ్రా మినహా మిగతా పేసర్ల పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరమే అన్నాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఉండుంటే.. భారత జట్టును అడ్డుకోవడం ఆసీస్కు కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
జియో సినిమాలో సైమన్ డౌల్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా షెడ్యూలింగ్లోనే స్మార్ట్గా వ్యవహరించినట్లు అనిపిస్తోంది. తమ బ్యాటింగ్ పైనా స్పష్టత మాత్రమే కాదు.. టీమిండియా బ్యాటర్ల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. అయితే ఆస్ట్రేలియాకు జస్ప్రీత్ బుమ్రా నుంచి అతి పెద్ద ముప్పు ఉంది. అందుకే మూడు పిచ్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పెర్త్లో వేడి దెబ్బకు బుమ్రా ఉడికిపోయేలా ప్రణాళికలను రూపొందించినట్లు ఉంది. భారత జట్టులో అతడే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ పెర్త్ పరిస్థితులు అందుకు పెద్దగా సహకరించవు. మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోతే బుమ్రా పైనే ఎక్కువ భారం పడుతుంది. అడిలైడ్, బ్రిస్బేన్లో కూడా పేస్ బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అక్కడ కూడా బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మహమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు తీవ్ర నష్టం’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?