AUS vs IND: ఆస్ట్రేలియా పెద్ద ప్లానింగే.. బుమ్రాను టార్గెట్ చేసిందిగా!
- న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం
- కనీసం నాలుగింటిలో విజయం సాధించాలి
- బుమ్రాను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో పడాల్సిన అవసరం ఎంతో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో భారత్ గత రెండు సిరీస్లను గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడిన బుమ్రా.. ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. 2018లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను (6/33) నమోదు చేశాడు. అందుకే బుమ్రాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తెలిపాడు. టీమిండియాలో బుమ్రా మినహా మిగతా పేసర్ల పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరమే అన్నాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఉండుంటే.. భారత జట్టును అడ్డుకోవడం ఆసీస్కు కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
Also Read: Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
జియో సినిమాలో సైమన్ డౌల్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా షెడ్యూలింగ్లోనే స్మార్ట్గా వ్యవహరించినట్లు అనిపిస్తోంది. తమ బ్యాటింగ్ పైనా స్పష్టత మాత్రమే కాదు.. టీమిండియా బ్యాటర్ల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. అయితే ఆస్ట్రేలియాకు జస్ప్రీత్ బుమ్రా నుంచి అతి పెద్ద ముప్పు ఉంది. అందుకే మూడు పిచ్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పెర్త్లో వేడి దెబ్బకు బుమ్రా ఉడికిపోయేలా ప్రణాళికలను రూపొందించినట్లు ఉంది. భారత జట్టులో అతడే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ పెర్త్ పరిస్థితులు అందుకు పెద్దగా సహకరించవు. మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోతే బుమ్రా పైనే ఎక్కువ భారం పడుతుంది. అడిలైడ్, బ్రిస్బేన్లో కూడా పేస్ బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అక్కడ కూడా బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మహమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు తీవ్ర నష్టం’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!