Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు.. తమ స్క్వాడ్లో ఇప్పటికే రిషభ్ పంత్తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి.
Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు.
ICC U-19 Womens World Cup: మహిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు ( జనవరి 18) అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి పోటీ పడబోతున్నాయి.
ఐపీఎల్ హీరో రింకూ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక రోల్ ప్లే చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభ కనబర్చి టీమిండియాలో స్థానం సంపాదించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారికి, యంగ్ ప్లేయర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రింకూ సింగ్ కు…
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 10 కొత్త నిబంధనలను జారీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇది టీమిండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా అనుసరించాలి. వీటిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు కఠిన శిక్షలు కూడా విధించబోనుంది బీసీసీఐ. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం, జీతం కోత వంటి అంశాలు తీసుకురానున్నారు. నిజానికి ఇదంతా జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే అంటూ సమాచారం. ఇక బీసీసీఐ జారీ చేసిన మొత్తం 10 నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. Also Read:…
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కొత్త సీజన్కు కౌంట్డౌన్ మొదలయింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న WPL మూడవ సీజన్ ఫిబ్రవరి 14, 2025నుండి ప్రారంభం కానుంది. ఈసారి 5 జట్లు ఈ లీగ్లో పోటీ పడనున్నాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) WPL 2025 షెడ్యూల్ను తాజాగా ప్రకటించింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 14న ప్రారంభమై, మార్చి 15న జరిగే టైటిల్ మ్యాచ్తో ముగియనుంది. ఈసారి WPL…
Sanju Samson: ఇంగ్లండ్తో జరుగనున్న వన్డే సిరీస్కి టీమిండియా ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. అంతేకాక, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో సమావేశం నిర్వహించి జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం సంజూ శాంసన్కి ఇబ్బంది కలిగించింది.…
గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా పర్యటనల్లో క్రికెటర్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో ప్లేయర్ వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ నిబంధనలు అమల్లోకి వస్తే.. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ…
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
BCCI: గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, ఆ తర్వాత జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా చేసిన పేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్ష నిర్వహించిన బీసీసీఐ, ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా ఆటగాళ్లకు అందించే పేమెంట్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, అలాగే వారి ప్రదర్శన అంచనాలను మెరుగుపరచడానికి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది. కేవలం గొప్ప ప్రదర్శన…