Home
Bcci
Bcci News
-
T20 World Cup: ఆడితే భారత్లోనే, లేదంటే స్కాట్లాండ్ను తీసుకుంటాం.. బంగ్లాకు ఐసీసీ వార్నింగ్..
T20 World Cup: T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్ను మార్చేది లేదని తమకు హామీ వచ్చిందిన ఐర్లాండ్ స్పష్టం చేసింది. -
BCCI Annual Contracts: గ్రేడ్ A+ ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ..! రోహిత్, కోహ్లీ లకు భారీ నష్టం తప్పదా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర… -
Gautam Gambhir Trolls: గంభీర్ సర్.. ఇక మీ సేవలు చాలు!
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం (జనవరి 18) ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత్ పర్యటనకు 8 మంది కొత్త ఆటగాళ్లు వచ్చినా.. అద్భుతంగా ఆడిన కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఓటమితో స్వదేశంలో సిరీస్ను కోల్పోయిన టీమిండియాపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.… -
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే.. ఆ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది?
ఇండియా, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ICC పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ గత టోర్నమెంట్ (2024)లో టాప్-7లో ఉండటం వల్ల డైరెక్ట్గా క్వాలిఫై అయింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భద్రతా ఆందోళనల కారణంగా భారత్లో జరిగే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ICCని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ICC బంగ్లాదేశ్కు జనవరి… -
IND vs NZ: రిషబ్ పంత్ అవుట్.. ఐపీఎల్ స్టార్ ఇన్!
స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమైన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 10) వడోదరలోని బీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ అస్వస్థతకు గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ అకస్మాత్తుగా తన కుడి వైపున ఉదరంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వెంటనే అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. సైడ్ స్ట్రెయిన్ (వక్ర కండరాల చీలిక) ఉందని తేలింది. దాంతో పంత్ను న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి బీసీసీఐ… -
Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్కు భారీ షాక్.. ఆటగాళ్ల స్పాన్సర్షిప్ రద్దు.!
Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు, ఆ దేశ క్రికెట్ జట్టుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగ్లా వ్యాప్తంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుండటంపై భారత్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేకేఆర్ అతడిని వదులుకుంది. ఇదిలా ఉంటే, దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్లేయర్లు, అక్కడి ప్రభుత్వం హద్దులు మీరి భారత్ను విమర్శించాయి. -
Mustafizur Rahman: ముస్తాఫిజుర్ను తీసేస్తే, బంగ్లాదేశ్ హిందువును కెప్టెన్ చేసింది: జేడీయూ నేత..
Mustafizur Rahman: కోల్కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి తీసేయడాన్ని భారత్లోని కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. రాజకీయాలను, క్రీడల్ని ముడిపెట్టొద్దని అన్నారు. -
IPL 2026-KKR: ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో డువాన్.. కేకేఆర్కు పండగే ఇగ!
ఐపీఎల్ 2026 వేలంలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) భారీ ధరకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2025 డిసెంబర్ 16న అబూదాబీలో జరిగిన వేలంలో ముస్తాఫిజూర్ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే వేలం ముగిసిన కొద్ది రోజులకే అంతా మారిపోయింది. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజూర్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా… -
Mohammed Shami: అయ్యో పాపం.. ఇక షమీని భారత జెర్సీలో చూడలేమా?
టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ‘మహ్మద్ షమీ’ ఒకడు. అతడి నైపుణ్యం, రికార్డులు అద్భుతం. అయితే ఇటీవలి కాలంలో వరుస గాయాలతో భారత జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్గా ఉన్న 35 ఏళ్ల షమీ.. దేశవాళీల్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీస్తూ.. తాను ఉన్నా అంటూ బీసీసీఐ సెలక్టర్లకు హెచ్చరికలు పంపుతున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. ఇక షమీని భారత… -
India’s Squad: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్!
త్వరలో న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. వన్డే సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్ కాగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ ఎంపికైనా.. బీసీసీఐ సెంటర్…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!