Aiden Markram Reaction: ఓ పక్క సుస్సు పడింది.. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు!
- అఫ్గానిస్థాన్పై రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా విజయం
- దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇలాంటి మ్యాచ్ కెరీర్లోనే ఎప్పుడూ ఆడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడలేదన్నాడు. మ్యాచ్లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని, ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఓ సమయంలో సుస్సు పడిందని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. బుధవారం అఫ్గానిస్థాన్తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఎయిడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ… ‘నా క్రికెట్ కెరీర్లో ఇలాంటి మ్యాచ్ నేను ఎప్పుడూ ఆడలేదు. ఇది నిజంగా అద్భుత మ్యాచ్. బంతి బంతికి నాలో ఉత్కంఠ పెరిగింది. ఓడిపోతామేమో అన్న భయం నాకు చాలాసార్లు అనిపించింది. ఒక సమయంలో క్వింటన్ డీకాక్ నా దగ్గరకు వచ్చి.. ఈ మ్యాచ్ ఓడిపోతే మన పరిస్థితి ఏంటి?, ఎంత అవమానంగా ఉంటుందని అన్నాడు. అది ఆలోచించాక నాలో ఇంకా టెన్షన్ పెరిగింది’ అని చెప్పాడు. ఈ మ్యాచ్లో మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేయగా. అఫ్గాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. మొదటి సూపర్ ఓవర్ టై కాగా.. రెండో సూపర్ ఓవర్లో సఫారీలు గెలిచారు.
Also Read
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
Also Read: Nara Lokesh: ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే.. అయానా, గయానా కంపెనీలకు భూములు ఇవ్వలేదు!
అఫ్గానిస్థాన్ జట్టు ప్రదర్శనను ఎయిడెన్ మార్క్రమ్ ప్రశంసించాడు. అఫ్గానిస్తాన్ బ్యాటర్ గర్బాజ్తో పాటు మొత్తం జట్టుకు అభినందనలు తెలిపాడు. ‘అఫ్గానిస్థాన్ టీమ్ అద్భుతంగా ఆడింది. గర్బాజ్ ఆసాధారణ ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. మిగతా వారు కూడా చాలా బాగా ఆడారు. చివరకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా ప్లేయర్స్ చాలా సంతోషించారు. టెన్షన్ పడిన నా సహచరులు.. విన్ కాగానే ఒక్కసారిగా గంతులేశారు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. టోర్నీలో ఇంకా మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది’ అని మార్క్రమ్ చెప్పాడు. మార్క్రమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!