బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్.. ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ దమ్ముంటే వినోద్ కుమార్ తో చర్చకి రావాలని బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ కి ఎంపీగా నువ్వేం చేశావో, బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చిద్దామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు తేలేకపోయావన్నారు కేటీఆర్.…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.
రాహుల్ గాంధీపై దాడి జరగలేదు.. కాంగ్రెస్ వారు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నమని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని, ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆరెస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బ తిన్నాయని, అయోధ్య కు రాహుల్ ఎందుకు రాలేదన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు…
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ తెలంగాణ చౌరస్తా కాషాయమయంగా మారింది. తెలంగాణ చౌక్ లో సంబురాలు అంబురాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ నేపథ్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు వివిధ హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు. తెలంగాణ చౌక్ వద్ద ఆనందోత్సవాల మధ్య హిందూ సంఘాల కార్యకర్తలతో కలిసి స్వయంగా బండి సంజయ్…
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, దైవ కార్యాన్ని రాజకీయం చేయొద్దన్నారు. రాముడు BJPకి మాత్రమే దేవుడు కాదని, ఈ అంశాన్ని తమ పార్టీకి ఆపాదించి వివాదాస్పదం చేయొద్దని అన్నారు. తాజాగా- బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఈ కార్యక్రమంలో…
రైతు మల్లికార్జున రెడ్డి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అందరికీ ఆదర్శమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట దిగుబడి రెట్టింపు చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్రుషి చేస్తున్నారని పేర్కొన్నారు. రసాయన ఎరువులు వాడే రైతాంగంతోపాటు నేటి యువత మల్లికార్జున రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా…
రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్ లుగా బీజేపీ చేసింది. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇంఛార్జి గా బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుండి క్లస్టర్ ఇంఛార్జి లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన…