Bandi Sanjay: గవర్నర్ను బీఆర్ఎస్ ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రజలు మరిచిపోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు.
Karumuri Nageswara Rao: వైసీపీ’సిద్ధం’ సభ వాయిదా
Also Read
- NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ను.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఛీ అంటూ తిరస్కరిస్తున్నారన్నారు. ఇంత జరిగినా వాళ్ల అహంకారం మాత్రం తగ్గలేదని.. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు ఛీదరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
Boyapati Next: బోయపాటితో అల్లు అరవింద్.. మాస్ కాంబో వచ్చేస్తోంది!
గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలని బీఆర్ఎస్ అనుకుందని… రాజ్యాంగానికి లోబడి పనిచేసే వాళ్లు బీఆర్ఎస్కు పనికిరారని ఫైరయ్యారు. అంతేకాకుండా రాజ్యాంగాన్నే మార్చాలంటూ అంబేద్కర్ను అవమానించారన్నారు. అత్యున్నత ప్రజాస్వామిక దేశం ఏదంటే ఠక్కున ఇండియా పేరే చెబుతారంటే.. మన రాజ్యాంగం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ రాజ్యాంగాలను మార్చుకున్నాయని.. కానీ భారత్ మాత్రం రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించినా.. మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చలేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ది మూడో స్థానమేనని జోస్యం చెప్పారు. ఇంకా గూండా గిరి చేస్తాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారని బండి సంజయ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!