ఈ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలువుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకోవడం పై ఆయన సోమవారం మాట్లాడుతూ ..కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్కు ఇనుపకంచెలు, ఫాంహౌస్కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన…
హైడ్రామాల నడుమ బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. బండి సంజయ్ ని అరెస్టు చేసి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు పోలీసులు. తలకు గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బండి సంజయ్ ను తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు పోలీసులు. దీంతో బండి సంజయ్ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఆఫీస్ తలుపులు పగులగొట్టి లోపలికెళ్లిన పోలీసులు బండి సంజయ్ ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.…
కరీం నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు. డౌన్ డౌన్ కేసీఆర్ అని మహిళా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్తో బండి సంజయ్ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా…
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్లా…
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు..…
పైన పటారం..లోన లొటారం. ఆ జిల్లాలో జాతీయపార్టీ తీరు అలాగే ఉందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని నాయకులు లెక్కలేస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం రివర్స్లో వెళ్తున్నారట. కుమ్ములాటలతో కాలక్షేపం చేస్తు.. వర్గాలను పెంచిపోషిస్తూ కేడర్ను కలవర పెడుతున్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీలో ఎవరివారే యమునా తీరే..!ఉమ్మడి నల్లగొండ జిల్లా. కామ్రేడ్లు, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆయువు పట్టుగా ఉన్న ఈ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. అలాంటి జిల్లాలో పుంజుకుని.. రాష్ట్రంలో…
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని హైదరాబాద్ నగరంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్న తరుణంలో ఆయన కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదని టీఆర్ఎస్ యూత్ విభాగం నేతలు సోమవారం నాడు సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Read Also: షెడ్యూల్ ప్రకారమే… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి…
కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ…