అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని స్వయంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ ప్రమోషన్స్లో రివీల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని…
NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి.. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ కూడా అంతే వేగంగా ఒకదాని తర్వాత మరొక అప్డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ మొదలైన రెండో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే, టీమ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. జూన్ 10వ తేదీన…
‘అఖండ’తో బ్లాక్బస్టర్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ.. ఆ జోష్లోనే వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో #NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో చేతులు కలపనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే! మరి, ఆ తర్వాత సంగతులేంటి? ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే, అవుననే ఇండస్ట్రీ…
మంత్రి గుమ్మనూర్ జయారామ్, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత జయరామ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కారు మంత్రి జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి జయరామ్ కు లేని ఆమె అన్నారు. జగన్ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శం మంత్రి జయరామ్ అంటున్నారు…అక్రమ మద్యం,…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని…
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో జత కట్టనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నట్టు ఆల్రెడీ అనిల్ ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా కథ ఓ తండ్రి – కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది, కూతురు పాత్రలో శ్రీలీలా నటిస్తోందని వెల్లడించాడు కూడా! ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నట్టు తెలిపాడు.…
తెనాలి పెమ్మసాని థియేటర్లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు.…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో…
సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉద్రిక్తంగా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. రెండు వారాల క్రితం హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం వైసీపీ వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఈస్థాయిలో ఎక్కడా వర్గపోరు లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నవీన్ నిశ్చల్ను కాదని.. 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్కు టికెట్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని టాక్. బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓడినా.. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి హిందూపురంలో ఇక్బాల్ పెత్తనం పెరిగడం.. నవీన్ వర్గానికి అస్సలు రుచించడం…