ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్గా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు కూడా భాగం కానున్నాడట!…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 107వ చిత్రం ఫస్ట్ హంట్ ఆయన బర్త్ డే కానుకగా జనం ముందు నిలచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం టీజర్ లో బాలయ్యకు సంబంధించిన పలు సెంటిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘సింహ’ అనే పదం బాలకృష్ణకు భలేగా అచ్చివస్తోంది. పైగా ఆయన నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆ సెంటిమెంట్ తోనే ఈ ఫస్ట్ హంట్ లోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక ఎమోషనల్…
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఉంటుందని అంతా ఆశించారు. కానీ, అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తూ వస్తున్నారే తప్ప, ఆ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. అప్పట్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్లో మోక్షజ్ఞ కనిపించొచ్చని టాక్ వినిపించింది కానీ, తీరా సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ నిరాశచెందారు. కొంతకాలం తర్వాత దన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని…
అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని స్వయంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ ప్రమోషన్స్లో రివీల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని…
NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి.. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ కూడా అంతే వేగంగా ఒకదాని తర్వాత మరొక అప్డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ మొదలైన రెండో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే, టీమ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. జూన్ 10వ తేదీన…
‘అఖండ’తో బ్లాక్బస్టర్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ.. ఆ జోష్లోనే వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో #NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో చేతులు కలపనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే! మరి, ఆ తర్వాత సంగతులేంటి? ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే, అవుననే ఇండస్ట్రీ…
మంత్రి గుమ్మనూర్ జయారామ్, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత జయరామ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కారు మంత్రి జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి జయరామ్ కు లేని ఆమె అన్నారు. జగన్ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శం మంత్రి జయరామ్ అంటున్నారు…అక్రమ మద్యం,…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని…
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో జత కట్టనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నట్టు ఆల్రెడీ అనిల్ ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా కథ ఓ తండ్రి – కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది, కూతురు పాత్రలో శ్రీలీలా నటిస్తోందని వెల్లడించాడు కూడా! ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నట్టు తెలిపాడు.…
తెనాలి పెమ్మసాని థియేటర్లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు.…