Arvind Kejriwal Bail: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తుపై సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
క్రిమినల్ కేసుల్లో బాలనేరస్తులకు బెయిల్ నిరాకరించొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర నేరస్థుడితో నైతిక, శారీరక సంబంధం, మానసికంగా ప్రమాదం ఉందని తేలితే తప్ప.. వారికి బెయిల్ నిరాకరించవద్దని స్పష్టం చేసింది.
భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్ దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు మనోరమ తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పూణే…
నటుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తానని బెదిరించినందుకు.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నందుకు గత నెలలో యూట్యూబర్ గుజార్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఆ కేసులో కోర్టు అతనికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్కు చెందిన బన్వరీలాల్ గుజ్జర్పై క్రిమినల్ బెదిరింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలి అశ్విని కోష్ట తల్లి మమతా కోష్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనతో షాకింగ్కు గురైనట్లు తెలిపింది.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు 23 ఏళ్ల యువకుడికి కర్ణాటక హైకోర్టు 15 రోజుల బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయానికొస్తే.. బాధిత మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. బాధితురాలికి ఇటీవలే 18 ఏళ్లు కూడా నిండాయి. ఈ క్రమంలో.. ఇరువర్గాల కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు సానుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జీవనాధారమైన తండ్రి అని…
పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు బెయిల్ లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఇద్దరికి ఊరట లభించింది.