Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు షాక్.. బెయిల్పై స్టే విధించిన కోర్టు..
- దిగువ కోర్టు మంజూరు చేసి బెయిల్ పై హైకోర్టు స్టే
- విడుదలైతే దర్యప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్న ఈడీ
- కేసుపై విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని స్పష్టం చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వంటి ప్రధాన పదవిని కలిగి ఉన్నారని.. ఇప్పుడు ఆయనను విడుదల చేస్తే..దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈడీ తన SLP లో పేర్కొంది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. పిటిషన్పై ముందస్తు విచారణ అవసరం లేదని పేర్కొంది.
READ MORE: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
కేసుపై విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని హైకోర్టు తెలిపింది. ఈ కేసుపై విచారణ పూర్తయ్యే వరకు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాలేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ను కేజ్రీవాల్కు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు పేర్కొంది. కేజ్రివాల్ కు బెయిల్ మంజూరు కావడం ఈడీకీ ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ లంచం డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.
READ MORE: Nvidia Mcap: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా
ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి తీహార్ జైలుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు కానందున విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉంటారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!