ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Ayodhya Special Train: అయోధ్య బలరాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఇవాళ కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Ram Mandir: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను ఖండిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ, జనవరి 20న సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై ఢిల్లీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అజయ్…
British MP: అయోధ్య రామ మందిరంపై బీబీసీ పక్షపాత కవరేజ్పై బ్రిటిష్ ఎంపీ బాబా బ్లాక్మన్ ధ్వజమెత్తాడు. జనవరి 22న జరిగిన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు సంబంధించి బీబీసీ తీరు సరిగా లేదని అన్నారు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి తగిన రికార్డుల్ని అందించాలని అన్నారు. యూకే పార్లమెంట్లో మాట్లాడిన బాబ్ బ్యాక్మన్.. 2000 ఏళ్లకు పైగా దేవాలయం ఉన్న విషయాన్ని మరిచిపోయి, మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అంటూ అయోధ్య రామ…
Ram Mandir : అయోధ్యలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగి నేటికి 12 రోజులు. ఈరోజు సంగతి పక్కన పెడితే, రామ్ లల్లాకు గత 11 రోజుల్లో రూ.11 కోట్లకు పైగా విరాళాలు అందుకున్నారు.
Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.…
Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా పండగ రీతిలో అయోధ్య రామమందిరం ఈ నెల 22 ప్రారంభమైంది. అయితే, అద్భుత రీతిలో నిర్మించిన ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకునేలా రూపొందించారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్తో సహా అనేక శాస్త్రీయ…
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్టు భక్తుల కోసం హారతి, దర్శనానికి వేళల్లో మార్పులు చేసింది. కొత్త సమయాలను పంచుకుంది. రామ మందిరం వద్దనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది.