Ayodhya Ram Mandir: 2500 ఏళ్లలో ఒకసారి వచ్చే భారీ భూకంపాన్ని రామ మందిరం తట్టుకుంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా పండగ రీతిలో అయోధ్య రామమందిరం ఈ నెల 22 ప్రారంభమైంది. అయితే, అద్భుత రీతిలో నిర్మించిన ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకునేలా రూపొందించారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్తో సహా అనేక శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించింది.
Read Also: Ram Mandir: వారం రోజుల్లో అయోధ్య రాముడిని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు..
Also Read
గరిష్టంగా వచ్చే భూకంపాలను తట్టుకునేలా ఆలయ నిర్మాణ భద్రతను నిర్ధారించడానికి శాస్త్రీయ అధ్యయనం జరిగింది. ఇది 2500 ఏళ్లలో వచ్చే శక్తివంతమైన భూకంపాన్ని తట్టుకుంటుందని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త దేబ్దత్తా ఘోష్ చెప్పారు. 50 కంటే ఎక్కువ కంప్యూటర్ మోడళ్లను సిమ్యులేట్ చేసిన తర్వాత మరియు దాని సరైన పనితీరు, నిర్మాణ ఆకర్షణ మరియు భద్రత కోసం వివిధ లోడింగ్ పరిస్థితులలో ఉన్న వాటిని విశ్లేషించిన తర్వాత స్ట్రక్చరల్ డిజైన్ను సిఫార్సు చేసినట్లు ఘోష్ చెప్పారు.
రామాలయ నిర్మాణానికి ఇనుము, ఉక్కును ఉపయోగించలేదు. వీటి కాల పరిమితి 90 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది, అందుకనే నిర్మాణంలో వీటిని ఉపయోగించలేదు. సరయు నదీ తీరంలో నిర్మాణం ఉండటంతో భూమిలో తేమ పరిస్థితులను తట్టుకునేందుకు అత్యంత బలంగా రాయి నిర్మాణాన్ని తలపించే విధంగా పునాదిని ఏర్పాటు చేశారు. పూర్తిగా రాతితో, ఇంటర్ లాక్ టెక్నాలజీతో రామ మందిర నిర్మాణం జరిగింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!