RSS Chief: పెరుగుతున్న మందిర్-మసీద్ వివాదాలు.. ఇది ఏమాత్రం మంచిది కాదు..!
- దేశంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరుగుతున్నాయి..
- ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. అందరం కలిసిమెలిసి ఉండాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
- హిందువులం కూడా రామకృష్ణ మిషన్లో క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief: పుణెలో ఇండియా-ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని మోహన్ భగవత్ సమర్థించారు. మన దేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని.. ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.
Read Also: Dead Body in Parcel: పార్శిల్లో డెడ్బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
కాగా, ప్రతి రోజూ కొత్త వివాదాలు తీయడంతో వీటిని ఎలా అంగీకరించమంటారని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు. మనం అందరం కలిసిమెలిసి ఉంటాం అనేది ఈ ప్రపంచానికి చూపించాలన్నారు. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం కొనసాగుతుంది.. దీంట్లో సర్కార్ ను నడిపే ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు కూడా పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నారు.. ఆధిపత్య భాష ఎందుకు?, ఎవరు మైనార్టీ?, ఎవరు మెజార్టీ? అని ప్రశ్నించారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే.. ఎవరి ఇష్టమైన దేవుడిని వారు కొలుస్తారని చెప్పుకొచ్చారు. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా ప్రతి ఒక్కరూ జీవించడం అవసరమని మోహన్ భగవత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!