RSS Chief: పెరుగుతున్న మందిర్-మసీద్ వివాదాలు.. ఇది ఏమాత్రం మంచిది కాదు..!
- దేశంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరుగుతున్నాయి..
- ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. అందరం కలిసిమెలిసి ఉండాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
- హిందువులం కూడా రామకృష్ణ మిషన్లో క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief: పుణెలో ఇండియా-ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని మోహన్ భగవత్ సమర్థించారు. మన దేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని.. ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.
Read Also: Dead Body in Parcel: పార్శిల్లో డెడ్బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!
Also Read
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
కాగా, ప్రతి రోజూ కొత్త వివాదాలు తీయడంతో వీటిని ఎలా అంగీకరించమంటారని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు. మనం అందరం కలిసిమెలిసి ఉంటాం అనేది ఈ ప్రపంచానికి చూపించాలన్నారు. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం కొనసాగుతుంది.. దీంట్లో సర్కార్ ను నడిపే ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు కూడా పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నారు.. ఆధిపత్య భాష ఎందుకు?, ఎవరు మైనార్టీ?, ఎవరు మెజార్టీ? అని ప్రశ్నించారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే.. ఎవరి ఇష్టమైన దేవుడిని వారు కొలుస్తారని చెప్పుకొచ్చారు. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా ప్రతి ఒక్కరూ జీవించడం అవసరమని మోహన్ భగవత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
-
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
-
Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
-
Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!