PAN Aadhaar link : కేంద్ర ప్రభుత్వం పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి జూన్ 30, 2023ని గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత ఆధార్తో పాన్ కార్డ్ని లింక్ చేయని వ్యక్తుల పాన్ కార్డులు పనిచేయవు.
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
Droupadi Murmu: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం లీడర్ ద్రౌపది ముర్ము భారత వాయుసేన ఫైటర్ జెట్ సుఖఓయ్-30 MKIలో తొలిసారి ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శనివారం యుద్ధవిమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్ పూర్ లోని భారత వాయుసేన ఎయిర్ బేస్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భద్రత బలగాలు సైనిక వందనం సమర్పించారు.
ప్రకృతి, మానవత్వం చాలా పవిత్రమైన సంబంధాన్ని పంచుకుంటున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 30 ఏళ్ల ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను పురస్కరించుకుని శుక్రవారం అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో 'గజ్ ఉత్సవ్ 2023'ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రకృతిని గౌరవించే సంస్కృతి మన దేశానికి గుర్తింపు అని రాష్ట్రపతి అన్నారు.
Punjab: ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు పంజాబ్ ను జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేశారు.
బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.
Assam: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతుండటంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, పందుల రవాణాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అస్సాం. అస్సాం పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ మంత్రి అతుల్ బోరా శనివారం మాట్లాడుతూ..అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కోళ్లు, పందులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలోని నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.