Himanta Biswa Sarma: అస్సాం ఎన్నికల వరకు బాల్య వివాహాలపై ఉక్కుపాదమే.. స్పష్టం చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crackdown On Child Marriage: అస్సాంలో బాల్యా వివాహాలపై అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. బిస్వనాథ్లో ఇప్పటి వరకు కనీసం 139 మంది, బార్పేటలో 128 మంది, ధుబ్రిలో 127 మంది పట్టుబడ్డారని పోలీసులు ప్రకటించారు.
ప్రస్తుతానికి బాల్య వివాహాలకు చేసిన తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నామని అరెస్ట్ చేయడం లేదని సీఎం వార్నింగ్ ఇచ్చారు. 2026 అస్సాం ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల బాల్య వివాహాల్లో 8 వేల మంది నిందితులుగా ఉన్నారు. తల్లిదండ్రులను విడిచిపెడితే అరెస్ట్ ఎదుర్కొనే నిందితుల సంఖ్య సుమారు 3,500 వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఖాజీల వ్యవస్థ( వివాహాలు నిర్వహించే ముస్లిం పెద్దలు)ను నియంత్రించాలని, అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అస్సాం సీఎం.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
Read Also: AIMIM Big Plan: ఎంఐఎం బిగ్ స్కెచ్.. ఏకంగా 50 స్థానాలపై గురి..
14-18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అస్సాంలో మాతా మరియు శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో నమోదైన వివాహాలలో సగటున 31 శాతం వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ లే కావడంతో ఈ సమస్య వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ నిర్ణయాన్ని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యేలు తప్పబడుతున్నారు. బడ్జెట్ తప్పులు, అదానీ వ్యవహారాన్ని పక్కకు పెట్టేందుకే హిమంత బిశ్వశర్మ ఇలా చేస్తున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తప్పుబడుతున్నారు. అరెస్టులు చేస్తే, పెళ్లయిన బాలికల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..