రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరిగే చివరి సెషన్లో రాజస్థాన్ అసెంబ్లీ ఈ రోజు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల పని హామీనిచ్చే మైలురాయి బిల్లును ఆమోదించింది. వృద్ధులు, ప్రత్యేక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్కు కూడా ఈ బిల్లు హామీ ఇస్తుంది.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సలహా మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో పొత్తు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ శనివారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటిసుల్లో పేర్కొనింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర…
త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు తీసుకుంటారు.
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం..పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. సచిన్ పైలట్ ఏ పార్టీ పెట్టడంలేదని, అదంతా అసత్య ప్రచారం.. ఒట్టి పుకార్లు మాత్రమేనంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం మూలంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇదే మొండితనం వల్ల మరిన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు.
PM Modi: 2008 జైపూర్ వరస పేలుళ్ల నిందితులను నిర్దోషిగా విడుదల చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడీ తప్పపట్టారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు విధానాన్ని అవలంభిస్తోందని, ఉగ్రవాదులపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని ప్రధాని ఆరోపించారు. రాజస్థాన్లోని అబురోడ్లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ,
Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిల్ పైలెట్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అవినీతి సమస్యలపై సచిన్ పైలట్ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు మే 11న ‘జన్ సంఘర్ష్ యాత్ర’ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం గెహ్లాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియాగాంధీ కాదని, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అని…
తనను "రావణ్" అని పిలిచినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఎదురుదాడికి దిగారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ ప్రమేయాన్ని గెహ్లాట్ ప్రస్తావిస్తూ, “నేను రావణుడినైతే, నువ్వు రాముడివి అయ్యి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇవ్వు” అని అన్నారు.