Ashok Gehlot on Modi: మోదీ మొండితనం వల్లే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot on Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం మూలంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇదే మొండితనం వల్ల మరిన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు. రాజస్థాన్ దివస్ సందర్భంగా సోమవారం జరిగిన లభర్తి ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానికి సూచించినప్పటికీ.. ప్రధాని పెడచెవిన పెట్టారని అన్నారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ వల్లనే 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని.. ప్రధాని మొండివైఖరి వల్ల బీజేపీ ఓటమిపాలైందని గెహ్లాట్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మొండితనానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటరుకు ఎవరైనా తలవంచాల్సిందనేనని, ప్రజల ఓట్లతోనే ఎవరైనా గెలుపు సాధించగలరని అన్నారు.
Read also: Esha Gupta: దాచుకోవాల్సినవన్నీ గాలికి వదిలేసి.. దాన్ని మాత్రం దాస్తావెందుకు పాప
Also Read
- Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- International Yoga Day 2026: కోల్కతాలో 35,000 మందితో కలిసి ప్రధాని మోడీ యోగా.. 2026 థీమ్ ఏమిటి?
రాజస్థాన్లో తమ ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు-2022ని ప్రధాని పరిశీలించాలని కోరారు. రాజస్థాన్లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా విపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే ఎలాంటి అంశం లేదన్నారు. ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ఆపివేయడం సరికాదన్నారు. వసుంధరా రాజే ప్రభుత్వం ప్రారంభించిన ఈస్ట్రన్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం ఆపలేదని పైగా ఆ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తే త్వరగా పూర్తవుతుందని కేంద్రానికి సూచించారు. ఇటీవల ప్రధాని అజ్మీర్ పర్యటనలో దీనిపై ప్రకటన చేస్తారని తాను ఆశించినప్పటికీ అలా జరగలేదని గెహ్లాట్ అన్నారు.
Read also: Husband Killed Wife: భార్య గొంతు కోసిన భర్త.. కథలో ఊహించని ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
దివాళా తీయడమంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదని.. మేధోపరంగా కూడా దివాళా తీయవచ్చని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఏ ప్రభుత్వమూ తమ ముందున్న పథకాలను నిలిపివేయకూడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఎన్నికల ఆధారిత ప్రకటనలు కావని.. చాలా కాలం పాటు అమలులో ఉండేందుకు ఉద్దేశించినవని పేర్కొన్నారు.’లాభర్తి ఉత్సవ్’ సందర్భంగా ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం కింద 14 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబాల బ్యాన్ ఖాతాలకు బదిలీ చేయబడ్డాయని తెలిపారు. ఏప్రిల్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద 76 లక్షల కుటుంబాలకు రూ. 500కి గ్యాస్ సిలిండర్లు అందించబడతాయన్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
-
YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
-
Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి జిగితార సాంగ్ రిలీజ్.. మణిశర్మ మెలోడీకి ఫ్యాన్స్ ఫిదా
-
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
-
Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!