ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆగడాలు ఆగటం లేదు. తాజాగా.. లంచం కేసులో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ), సబార్డినేట్ ఉద్యోగిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరందరినీ డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) కార్యాలయంలో నియమించారు. వీరంతా లంచం తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు.. ఏప్రిల్ 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
ఉత్తరప్రదేశ్లో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన.. ఇద్దరు పాకిస్థానీలు సహా ముగ్గురు ఉగ్రవాదులను యూపీ ఎస్టీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ(ISI) సాయంతో భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు ప్లాన్ చేశారు. STSF ప్రకారం.. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI సహాయంతో కొంతమంది పాకిస్తాన్ పౌరులు నేపాల్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించబోతున్నట్లు కొంతకాలం నుంచి మాట్లాడుతున్నారు. వీరంతా భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని, ఐఎస్ఐ సాయంతో హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరంలో శిక్షణ కూడా…
తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా తన ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతకంగా చంపేశాడు. ఆ వ్యక్తి ఇదివరకే ఓ కూతుర్ని చంపి జైలు నుంచి బయటకు వచ్చాడు. బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇదు మియాన్, అతని భార్య అఫ్రీన్ ఖాతున్. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్ (12), షెహ్బాజ్ ఖతున్ (9).…
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అరెస్ట్ విషయంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని ఆమె తేల్చారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జమ్మూలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని జమ్మూ కాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని కోసమని క్రైమ్ బ్రాంచ్ అనేక నగరాల్లో వెతుకులాట ప్రారంభించి చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.