CBI: లంచం కేసులో ప్రభుత్వ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్తో సహా ముగ్గురి అరెస్ట్, భారీ నగదు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆగడాలు ఆగటం లేదు. తాజాగా.. లంచం కేసులో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ), సబార్డినేట్ ఉద్యోగిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరందరినీ డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) కార్యాలయంలో నియమించారు. వీరంతా లంచం తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు.. ఏప్రిల్ 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సమాచారం అందింది. దీంతో.. సీబీఐ, విజిలెన్స్ అధికారులు సంబంధిత కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా.. ఔషధాల తయారీదారులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఎన్ఓసీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల తరపున ప్రైవేట్ వ్యక్తులు లంచం వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
Also Read
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
Earthquake: హిమాచల్ ప్రదేశ్లో 5.3 తీవ్రతతో భూకంపం..
సీబీఐతో సహా వివిధ బృందాల ఆకస్మిక తనిఖీల్లో ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల డ్రాయర్ల నుంచి దాదాపు రూ.1.52 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. NOCలు జారీ చేయడం కోసం నేరుగా లేదా CHAలు లేదా వారి ప్రతినిధుల నుండి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సందేహాస్పదమైన ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా లెక్కించబడని డబ్బును స్వీకరించినట్లు నివేదించబడింది.
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడిన అధికారులను అరవింద్ ఆర్. హివాలే (అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్), దేవేంద్ర నాథ్ (డ్రగ్ ఇన్స్పెక్టర్), నాగేశ్వర్ ఎన్. సబ్బాని (సబార్డినేట్ స్టాఫ్)గా గుర్తించారు. లంచం డిమాండ్, అంగీకరించడంపై సీబీఐకి లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వారి ఇళ్లలో సోదాలు చేయగా, వారి వద్ద నుంచి సుమారు రూ.46.70 లక్షల విలువైన పత్రాలు, నగదు, రూ.27.80 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, వివిధ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు మరియు ఇతర అభ్యంతరకర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!