APSRTC: ఏపీఎస్ఆర్టీసీ స్త్రీశక్తి పథకం విజయవంతం చేయడంలో భాగంగా.. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు స్వాగతించారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థికాభివృద్ధి, ఉత్సాహం పెంపుదల దిశగా దోహదం చేస్తాయని వారు తెలిపారు. స్త్రీశక్తి పథకం విజయవంతం కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ఆర్టీసీ ఇ.యూ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగుల కోసం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.…
Free Bus Travel In AP: ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావడం తప్పనిసరి.. భవిషత్తులో స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంది.. ఏపీ మహిళలు అయితే ఉచిత బస్సుకు అర్హులు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అధికారికంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆగస్టు 9 న రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రకటన చేయనున్నారు. ఆగష్టు 15 నుంచి అధికారికంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో…
ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు.. రాష్ట్ర మంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది.
పీఎస్ఆర్టీసీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సిబ్బంది నియామకం కంటే ముందే.. వందల సంఖ్యలో రిటైర్మెంట్లు పెద్ద సమస్యగా మారింది. పాత బస్సులకు రంగులేసి సిద్ధం చేసుకోవడంలో తలమునకలైన ఏపీఎస్ఆర్టీసీకి సిబ్బంది కొరత భారీగా ఎదరవనుంది. ఏపీఎస్ఆర్టీసీలో జూన్, జులై నెలల్లో పదవీ విరమణకు సుమారు 900 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొత్త సిబ్బందిపై అధికారులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. Also Read: Pawan Kalyan: సినిమా డైలాగులు హాలు వరకే బాగుంటాయి.. వైఎస్ జగన్కు…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎండికి లేఖ రాసింది. ఏపీపీటీడీ సంస్థలో క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలలో ఉద్యోగులకు పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిటైర్ అయ్యే ఉద్యోగులను నియమిస్తు.. వీరందరికి లేబర్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. Also Read:Lavanya: నన్ను వాళ్లు…
ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు కొనసాగిస్తోంది.. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్ళి వచ్చింది.. అక్కడ ఆ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసింది.. ముఖ్యమంత్రి, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపై కూడా దృష్టిపెట్టారు.. అలాగే అధికారులు సైతం తెలంగాణ, కర్ణాటక వెళ్ళి వచ్చారు... ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.
సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల సంక్రాంతి పండుగ సమయంలో ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..
సంక్రాంతి పండగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది... ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది..