AP Free Bus Scheme: ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి పేరు ఖరారు
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరు ఖరారు..
- పథకానికి ' స్త్రీ శక్తి ' అని పేరు పెట్టిన ప్రభుత్వం..
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రణ.. ఆగస్టు 15నుంచి అమల్లోకి రానున్న స్త్రీ శక్తి పథకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. అయితే, ఈ పథకంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు.. రాష్ట్ర మంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది.. అయితే, ఈ విషయం పై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు.. వచ్చే ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకానున్న విషయం విదితమే..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
ఇక, మహిళలు ఉచిత బస్సు సన్నద్ధతపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. డిపో మేనేజర్లకు దిశా నిర్దేశం చేశారు.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై కూడా చర్చించాం. ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సులు మెయింటినెన్స్ పై సూచనలు చేశాం. మొదట్లో ఎక్కువ మంది మహిళలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి ఎలా తట్టుకోవాలన్నది కూడా చర్చించామని తెలిపారు.. డ్రైవర్లు, కండక్టర్ల వరకూ ఎక్కువ బాధ్యత ఉంటుంది. త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతి ఏటా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. డిజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు..
తాజావార్తలు
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!