Kapu Reservation: సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!
- హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
- ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్
- ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామ జోగయ్య ఎప్పటినుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే.
‘8-3-2019 టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో 14 నెంబర్ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి.. ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదు. కాపు సంక్షేమ సేన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మేము వేసిన పిటిషన్కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్గా 5% రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపింది. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలి. డిసెంబర్ 4న న్యాయస్థానంలో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్నే సమర్థిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించడం జరిగింది. ఈనెల జనవరి 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుంది, ఈలోపు కూటమి ప్రభుత్వం కాపుల పట్ల స్టాండ్ ఏంటో తెలపాలి. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలి. జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని దీక్ష విరమింప చేయమని నాకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి’ అని చేగొండి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!