Kapu Reservation: సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!
- హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
- ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్
- ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామ జోగయ్య ఎప్పటినుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే.
‘8-3-2019 టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో 14 నెంబర్ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి.. ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదు. కాపు సంక్షేమ సేన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మేము వేసిన పిటిషన్కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్గా 5% రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపింది. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలి. డిసెంబర్ 4న న్యాయస్థానంలో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్నే సమర్థిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించడం జరిగింది. ఈనెల జనవరి 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుంది, ఈలోపు కూటమి ప్రభుత్వం కాపుల పట్ల స్టాండ్ ఏంటో తెలపాలి. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలి. జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని దీక్ష విరమింప చేయమని నాకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి’ అని చేగొండి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!