విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ENT హాస్పిటల్ లో రోజులో 10 లోపు కేసులు వస్తున్నాయి. సింగరేణి హాస్పటిల్స్ లో రోజుకి 7,8 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ హాస్పిటల్లో లిపోసామాల్ అంఫోటేరిసిన్ బీ ఇంజక్షన్ అందుబాటులో లేవు. దేశంలో కేవలం నాలుగు చోట్లే ఈ ఇంజక్షన్ తయారీ అవుతుంది. ఒక పెసెంట్ కు సర్జరీ చెయ్యాలంటే 104 వైల్స్ కావాల్సి ఉంటుంది. పెసెంట్ వైట్ ను బట్టి ఒక కేజీ వైట్…
ఇప్పటికే కరోనా కలవర పెడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. అయితే ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇంతియాజ విచారణకి ఆదేశించారు.
ఎంపి రఘురామకృష్ణంరాజు అరెస్టు వివాదం ఇప్పుడు పూర్తిగా సుప్రీం కోర్టు చేతుల్లోకి వెళ్లిపోవడం వూహించిన పరిణామమే. ఆయనను ఎపి సిఐడి పోలీసులు దర్యాప్తు సందర్భంలో కొట్టారో లేదో తేల్చడానికి సికిందరాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయనను అక్కడే కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. ఈ వైద్య పరీక్షల ఖర్చు ఎంపినే భరించాలని కూడా చెప్పడం కొసమెరుపు. ఏమైనా ఇప్పుడు అరెస్టును మించి ఆయనను కొట్టారా లేదా అన్నది…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే నిన్నటి కంటే ఇవాళ ఏపీలో కరోనా కేసులు తగ్గిపోయాయి. ఏపీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 18,561 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచరీ దాటేసి 24 గంటల్లో 109 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 17,334 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం…
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ. మరి విపక్షాలు, పచ్చ మీడియా వాళ్లు గింజుకుంటున్నారేంటి? వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా ఉంది. అచ్చెం, ధూళిపాళ్ల, కొల్లు అరెస్టైనప్పుడు కూడా టీడీపీలో ఈ ఏడుపులు, పెడబొబ్బలు లేవే. అంతగా పెనవేసుకుపోయాడా…
కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో…
తిరుమల శేషాచల కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు జరిపారు. దాంతో తాజాగా 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. కొండను తవ్వి మరీ సొరంగం ఏర్పాటు చేసారు. ఈ ఘటనలోపోలీసుల అదుపులో నిందితుడు మంకు నాయుడు, మరో ఆరుగురు కూలీలు ఉన్నారు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామిజీ చెప్పడంతో సోరంగం తవ్వినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు మంకు నాయుడు. నిందితుడి సాయంతో సొరంగంను తనిఖీ చేసిన పోలీసులు.. కొండలోపల 80 అడుగుల భారీ…
ఎంపీ రామ్మోహన్ నాయుడికి తమ్మినేని సీతారాం కుమారుడు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యాక్సిన్, కరోనా చికిత్స గురించి ఎంపీ రామ్మోహన్ నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చురకలు అంటించారు. దేశంలో ఏ రాష్ట్రం బయటి దేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవడం లేదని..అలాంటి పరిస్థితులు ఉంటే నిరూపించాలని రామ్మోహన్ నాయకుడికి సవాల్ విసురుతున్నానని పేర్కొన్నారు. మీ నాయకుడు చంద్రబాబు.. హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్…
జనం కొడతారని పారిపోయి ఢిల్లీ పారిపోయిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నీచమైన పనులు చేసే వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంటే కుట్రదారులందరూ రంగంలోకి దిగారు అని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు కోసం లాబీయింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. జైలుకు వెళ్ళకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ కు వెళ్ళాలని, పోలీసుల పై…
రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు.రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం…