సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్ ఫిక్స్ అయిందా? అశోక్ గజపతిరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? త్వరలో కీలక పరిణామాలు ఉంటాయా? సూత్రధారులు.. పాత్రధారుల చిట్టా బయటపడుతోందా? అసలేం జరుగుతోంది? 700 ఎకరాలను ఆలయ రికార్డుల నుంచి తప్పించారా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే రంగంలోకి దిగింది సర్కార్.…
విశాఖలో సీమ పందుల కోసం సినీ ఫక్కీలో దాడి చేసారు దుండగులు. అర్ధరాత్రి వేంపాడు టోల్ ప్లాజా దగ్గర 100మంది హాల్ చల్ చేసారు. విజయనగరం నుంచి చెన్నైకి విత్తన పందులను తరలిస్తున్న వ్యాన్ అడ్డగించి డ్రైవర్, సహాయకులపై దాడి చేసి సీమపందుల వ్యాన్ అపహరించేందుకు విఫలయత్నం చేసారు. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అలెర్ట్ కావడంతో దుండగులు పరారయ్యారు. ఆ సీమ పందులు ఉన్న వాహనంను వెంబడించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంతో ఈ…
తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లోకి దర్శనాలకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో నేటి నుంచి భక్తులకు సత్యదేవుని వ్రతములు, కల్యాణములు, తలనీలాల సమర్పణకు అవకాశం కల్పించారు. అయినవల్లి , అంతర్వేది, అప్పనపల్లి, కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాలకు భక్తుల రాక తిరిగి ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
పోక్సో కేసుల సత్వర విచారణకు ఏపీలో 16 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసారు. ప్రత్యేక కోర్టుల పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. చిత్తూరు, తూ.గో, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,కర్నూలు, కడప, అనంత జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను జిల్లా మొత్తం పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం… విజయవాడ ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియాను నిర్ధారించించి. మిగిలిన కృష్ణా జిల్లా అంతా మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ…
గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 6,328 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,315 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 822.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 42.6064 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354 కి చేరింది. ఇందులో 18,42,432 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 38 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,744 కి చేరింది. ఇకపోతే గడిచిన…
రెండున్నరేళ్ల డెడ్లైన్ దగ్గర పడుతోంది. మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎంత లేదన్నా పవర్ పవరే కదా? దాన్ని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తాను సశ్చీలుడునని చెప్పుకొంటున్నారు ఓ డిప్యూటీ సీఎం. అంతేకాదు చివరకు తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాడైన సీఎం జగన్ కాళ్లమీద పడ్డారు. ఇవన్నీ ఆయన పవర్ని కాపాడతాయా? నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని చెబుతున్నారుఎవరు కనిపించినా ఒకటే పాట పాడుతున్న డిప్యూటీ సీఎం! మంత్రి పదవి రాగానే ఏసీ…
శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,797 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,89,513 కి చేరింది. ఇందులో 18,38,469 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,706 కి చేరింది. ఇకపోతే గడిచిన…
అధికార పార్టీ నుండి బయటకు వచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష పార్టీ కూడా షాక్ ఇచ్చింది. ఇంటి కూటికి.. బంతి కూటికి కాకుండా పోయారు. అంతా మోసం చేశారని వాపోతున్నారట. రాజకీయ భవిష్యత్పై బెంగ పెట్టుకున్నారట. ఎవరా నాయకుడు? ఏమా కథ? పొలిటికల్ స్టెప్పులు సరిగ్గా వేయలేకపోయారా? ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాలో మళ్లీ చర్చ మొదలైంది. ఇటు అధికార వైసీపీలో అటు ప్రతిపక్ష టీడీపీలో డేవిడ్రాజుకి…