ఏపీలో నకిలీ చలాన్ల స్కాం కలకలం
నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఘటనలు కలకలం సృష్టించాయి. కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. గుంటూరు జిల్లాలో 35 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు. 2020 జనవరి నుంచి అప్ లోడ్ చేసిన చలాన్ల తనిఖీల్లో మోసాలు బయటపడ్డాయి. 2021 జనవరి నుంచి నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు.
దాదాపు ఎనిమిది మంది పూర్తిస్థాయిలో స్టాంప్ డ్యూటీ కట్టినట్లు చలాన్లు సమర్పించినా ప్రభుత్వ ఖజానాకు మాత్రం జమకాలేదు. దీంతో నకిలీ చలాన్ల ద్వారా మోసం చేసినట్లు అధికారులు తేల్చారు. మరికొన్ని డాక్యుమెంట్లలో చలాన్ల రూపంలో స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు చూపించినా సీఎంఎఫ్ఎస్ లో మాత్రం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దాదాపు 8మంది ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఆస్థులు కొనుగోలు చేసి స్టాంప్ డ్యూటీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సబ్ రిజిష్ట్రార్ ఫిర్యాదుతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ చలాన్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి వివరాలను కూడా అందించారు.
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
ఫిర్యాదులో ఎవరెవరు ఎలా మోసం చేశారో, ఎంత మొత్తం మోసం చేశారో కూడా వివరించారు. దీంతో నకిలీ చలాన్ల మోసంపై విచారణ ప్రారంభించారు పోలీసులు. నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఘటనల్లో కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఉందని, వారికి కొంతమంది సిబ్బంది కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చలాన్ల కేసులో… కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. వీరు చలాన్లలో భారీ అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో నిర్ధారించారు. మరికొందరు స్టాంప్ రైటర్లపై అధికారులు పీఎస్లో ఫిర్యాదు చేశారు.
- Tags
- ap
- Fake challans
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!