కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్…
ఏపీలో 11 మంది డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. శ్రీశైలం ఈవోగా లవన్న నియమించబడటంతో జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా శ్రీశైలం ఈవో కేఎస్ రామారావుకు ఆదేశాలు జారీ చేసారు. ఇక కోవూరు ఆర్డీఓగా ఏక మురళి, అమలాపురం ఆర్డీఓగా వసంత రాయుడు, ఏపీఎస్సీసీఎఫ్సీ కృష్ణా జిల్లా ఈడీగా చంద్ర లీల, గురజాల ఆర్డీఓగా పార్థసారధి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ పీఏగా వసంత బాబు, కడప మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్గా రంగ స్వామి, నర్సిపట్నం ఆర్డీఓగా గోవింద రావు,…
తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది. కొన్నాళ్ల క్రితమే..…
రాజమండ్రిలో గోరంట్ల నివాసానికి పార్టీ అధిష్టానం నుంచి త్రిసభ్య బృందం చేరుకుంది. అధిష్టానం బృందంలో విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రులు చినరాజప్ప జవహార్ తదితరులు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది టీడీపీ అధిష్టానం. రాజీనామా యోచన విషయంలో ఉన్న గోరంట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దాంతో గోరంట్ల నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అనుచరులు. బుచ్చయ్య డిమాండ్లు పరిశీలనలోకి తీసుకుని, ఆదిరెడ్డి అప్పారావుతో…
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా.. ఏదో జరుగుతోంది. రాష్ట్రం చుట్టూ కేంద్ర మంత్రులు చక్కర్లు కొడుతున్న తీరు చూస్తుంటే.. ఈ అనుమానం బలపడుతోంది. పైకి చెప్పే కారణాలు ఏవైనా సరే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. వరసపెట్టి మంత్రులంతా ఏపీ చుట్టే ఎందుకు తిరుగుతున్నారన్నది.. జనానికీ అయోమయాన్ని కలిగిస్తోంది. దక్షిణాదిన బలపడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆలోచనలు.. ఏపీ కేంద్రంగానే అమలు కాబోతున్నాయా అన్న చర్చ సైతం మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల.. జాతీయ…
పరిపాలనలో ఆరితేరిన అధికారులు ఉంటే పాలకులకు.. పైవాళ్లకు వర్క్ ఈజీ. అవినీతిలో ఆరితేరిన ఘనులు ఉంటే ప్రజాప్రతినిధులు.. కమిషనర్లకు తిప్పలే తిప్పలు. కొన్నిసార్లు గొడవలకు దారితీస్తుంది. ఆ కార్పొరేషన్లో అదే జరుగుతోందట. ఏకంగా మేయర్, కమిషనర్ మధ్యే చిచ్చు పెట్టేలా వ్యవహారాలు నడిపిస్తున్నారట. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. పాలకుల మధ్య కీచులాటలకు అవినీతి అధికారుల ఎత్తుగడ! గుంటూరు కార్పొరేషన్లో కొత్త పోకడలకు తెరతీస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. విభజించి పాలించాలని అనుకున్నారో ఏమో…
ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డున దిగాక బోడి మల్లన్న అన్నట్టు ఉందట అక్కడ గెలిచిన ఎమ్మెల్యేల తీరు. విజయతీరాలకు తీసుకెళ్లిన కేడర్ను ఎవరూ పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యేను కలిసి తమ గోడు చెప్పుకోవాలంటే అనేకమందిని దాటుకుని వెళ్లాలట. ఆ నియోజకవర్గం ఎక్కడో.. ఏంటో.. లెట్స్ వాచ్! ఏటికి ఎదురీదే ఓటరుకి కేరాఫ్ అడ్రస్ పాతపట్నం పేరులో పాతదనం ఉన్నా.. రాజకీయ చైతన్యంలో ఎప్పుడూ కొత్తగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. చిన్న చిన్న పల్లెలు.. ఎదుగూబొదుగూ…
నేటి ఇంఛార్జ్లే రేపటి అభ్యర్థులు. ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. పార్టీ కూడా గట్టి నిర్ణయానికే వచ్చేసిందట. నాయకులను ఒప్పించే బాధ్యతలను పెద్దలే తీసుకున్నట్టు టాక్. అదేలాగో..ఎందుకో ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గ ఇంఛార్జ్ల నియామకంపై టీడీపీ ఫోకస్! 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ టీడీపీలో ముఖ్యనేతలు చాలా మంది కాడి పడేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం నియోజకవర్గాలను వదిలి వెళ్లిపోయారు. సొంత వ్యాపారాల్లో కొందరు.. మౌనంగా మరికొందరు ఉండిపోయారు.…
ఆయన మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నేత. ఆ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఉన్నట్టుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న ఇంఛార్జ్ పదవిని పీకేసింది పార్టీ. కొత్త నాయకుడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. ఎందుకీ మార్పు? మాజీ ఎమ్మెల్యే ఎందుకు రుచించలేదు? టీడీపీ ఇంఛార్జ్ పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే తొలగింపు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూలుతున్నాయి. కేడర్ చెల్లాచెదరవుతోంది. ఇలాంటి నియోజకవర్గాలపై టీడీపీ అధిష్ఠానం ఫోకస్ పెడుతోంది. ఎన్నికలకు రెండున్నరేళ్లు…
ఒకరు చేతికి ఉంగరం పెట్టుకున్నారు. ఇంకొకరు కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. ఏకంగా గుడే కట్టించేశారు మరొకరు. వీటన్నింటికీ మూల మంత్రం ఒక్కటే. రేస్లో ముందుకెళ్లడమే. కొత్త పదవి చేపట్టడం.. లేదా ఉన్న పదవిని కాపాడుకోవడం. ఆ జిల్లాలో అధికారపక్ష నేతలు చేస్తున్న ఈ విన్యాసాలే ఇప్పుడు ఆసక్తిగా మారాయి. సీఎం జగన్ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం? దేవుడు కరుణించాలి. వరాలు కురిపించాలి. సామాన్య భక్తులు ఈ ఆశతోనే గుళ్లకు వెళ్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. రాజకీయ నాయకులైతే…