ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్లోకి వెళ్తోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్లోకి వెళ్తోందా? ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? ముందుగా అనుమానాస్పద అధికారులపై ఫోకస్ పెట్టిందా? ఆఫీసర్ల చెక్లిస్ట్ సిద్ధం చేస్తోందా? ఆ జాబితాలోకి వచ్చే అధికారులను ఏం చేస్తారు? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
అధికారులకు ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆరా..!?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. క్రమంగా ఎలక్షన్ మూడ్లోకి తీసుకెళ్తున్నారు సీఎం జగన్. మంత్రులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి పీకే టీమ్ రంగంలోకి దిగబోతున్నట్టు స్వయంగా సీఎం జగనే కేబినెట్ భేటీలో చెప్పారు. ఈ రకంగా పార్టీని యాక్టివేట్ చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తోన్న ముఖ్యమంత్రి.. పరిపాలనా పరంగా కూడా అంతే పక్కాగా వెళ్లాలని డిసైడైనట్టు సమాచారం. రోజువారీ పాలనా వ్యవహారాలతోపాటు అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది..? వారికేమైనా రాజకీయ ఉద్దేశాలు.. కోరికలు.. లింకులు ఏమైనా ఉన్నాయా..? అనేదానిపై మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారట ప్రభుత్వ పెద్దలు.
ఇద్దరు ఐజీ స్థాయి అధికారులకు ప్రాధాన్యం లేదట..!
ప్రత్యేకించి ఎవరైనా IASలు.. IPSలకు ప్రతిపక్షంతో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సాన్నిహిత్యం ఉందని తెలిస్తే.. అలాంటి వారి జాబితాను రెడీ చేస్తున్నారట. ఎవరిని అనుమానించాలి? ఇంకెవరిని వాచ్లిస్ట్లో పెట్టాలనే కోణంలో ఆఫీసర్లపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ తరహా జాబితాల రూపకల్పన ఐపీఎస్ సర్కిల్లోనే ఉండేదని.. ఇప్పుడు IASల విషయంలోనూ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు ఐజీస్థాయి ఐపీఎస్లకు ఎలాంటి ప్రయార్టీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని గుర్తు చేసుకుంటున్నారట.
నిఘా రాడార్లో మరో ఇద్దరు ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్లు?
ఇదే క్రమంలో ఇద్దరు IASలు, మరో ముగ్గురు IPSలు అనుమానితుల జాబితాలో చేరినట్టు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరి విషయంలో పక్కా ఆధారాలు దొరికే వరకు ప్రభుత్వ పెద్దలు వేచి చూడాలని అనుకుంటున్నారట. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి ఉద్యోగ వర్గాల్లో గుసగుసలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఎవరిపై ఫోకస్ పెట్టింది? IAS, IPSలలో ఎవరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అవి ఎలాంటి పరిచయాలు? ఇలా ఎవరికి వారు ఆరా తీసే పరిస్థితి ఉంది.
- Tags
- Andhra Pradesh
- ap
- election mood
- ycp
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!