గుజరాత్ డ్రగ్స్ కేసుకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెరాయిన్ కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బట్ట కాల్చి మీద వేయటం టీడీపీ అలవాటే అని చెప్పిన ఆయన టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నాడు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రెస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు. ఏపీకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారు. జీవీ ఆంజనేయులు ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫెర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు అని తెలిపారు.
ఇక కాల్ మనీ కేసులో డైరెక్టుగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆసాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరు. మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్ పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రగ్స్ ను ఏపీలోకి రానివ్వరు. ఆధారల్లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు. సత్తెనపల్లి లో ఎంపీటీసీ లను కిడ్నాప్ చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకోలేదు. అయ్యన్నపాత్రుడు నీచంగా మాట్లాడారు. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని పేర్కొన్నారు.
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..