తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్…
ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం రేపుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ బయటపడాలి. ప్రశ్నించే గొంతులను ఎందుకు నొక్కుతున్నారు? దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకోవద్దని డీజీపీకి తెలుపుతున్నాను. తూర్పు గోదావరి నుంచి సుబ్రహ్మణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో బలైపోయాడు. సుబ్రమణ్యం మరణానికి అసలు కారణాన్ని అన్వేషించాలి. ఎమ్మెల్సీ అనంత బాబు…
రుతుపవనాల ప్రభావం కారణంగా తుంగభద్ర డ్యాంకి వరద నీరు ఉప్పొంగుతోంది. కర్ణాటకను వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి ఇన్ ఫ్లో పెరిగింది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల ఆనకట్టకు…
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు. రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక…
ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. గతంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల విమర్శలపై అదేరేంజ్లో పవన్ ఫైరయ్యారు. మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే అది వైసీపీకే లాభం. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు ఒక కూటమికి పడితే అది లాభం అవుతుంది. ఓటు చీలిపోతే వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారు. స్వల్ప ఓట్ల తేడాతో…
కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. పోస్ట్ మార్టం నిర్వహించాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కావాలి. అయితే, కుటుంబసభ్యులు మాత్రం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నుంచి స్పందన రాకపోవడం, కాకినాడ జీజీహెచ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. సుబ్రహ్మణ్యం శవపంచనామాకు సంతకాలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారు. మాకు న్యాయం చేసే వరకు సంతకాలు పెట్టమని అంటున్నారు…
కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్…
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మార్కాపురంలో మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును వేయాల్సిన పేరుని తప్పుగా ముద్రించారు మునిసిపల్ అధికారులు. ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు అధికారులు. వెంటనే గుర్తించి…
ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు…