R. Krishnaiah: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ‘ ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పార్లమెంట్ లో బీసీల న్యాయపరమైన డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యమాల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు. దేశంలో 70 కోట్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని.. చట్ట సభల్లో తమకు వాటా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 నుండి 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభ ఎంపీగా ఆయన ఇటీవల ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?