న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచేసింది. నేడు హైదరాబాద్ లో నాని మీడియాతో ఇంటరాక్షన్ అయ్యాడు. ఇక ఈ సమావేశంలో నాని మరోసారి ఏపీ టికెట్…
పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన డైలాగ్స్, స్క్రీన్ ప్లే, తారాగణం, మ్యూజిక్ తో కోసం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే తాజాగా నాగ బాబు ‘భీమ్లా నాయక్’ను ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్లో సినిమా సమస్యలు, ప్రస్తుతం పరిస్థితుల గురించి ప్రస్తావించారు. సినిమా ఎలా పని చేస్తుందో, దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలియదని…
ఏపీ టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరిపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై పెదవి విరుస్తుండగా, తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమా విషయంలో జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేశారు. Read Also :…
ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ తో సినీ ప్రముఖులు జరిపిన సమావేశం ఫలప్రదమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగానే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్ల పైన కూడా ఈ నెల మూడో వారంలోనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం…
వివాదాస్పద దర్శకుడు వర్మ మళ్ళీ నిద్ర లేచాడు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. భేటీలో పాల్గొన్న ఏ ఒక్క సెలెబ్రిటీనీ వదలకుండా అందరిపైనా సెటైర్లు వేస్తున్నారు. నిన్న రాత్రి మెగా బెగ్గింగ్ అంటూ చిరంజీవిని మాత్రమే టార్గెట్ టార్గెట్ చేసిన వర్మ… ఒక్కడినే టార్గెట్ చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో మరి… ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఇప్పుడు…
నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. పైగా సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది అంటూ అంతా సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో సంతోషంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అయితే శుభం కార్డు పడిందని, మరో వారం,…
టాలీవుడ్లో నెలకొన్న సమస్యలు, ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్తో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 14 రకాల విజ్ఞప్తులను టాలీవుడ్ బృందం సీఎంకు వివరించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో హీరో మహేష్బాబు మాట్లాడాడు. ఆరు…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టిక్కెట్ ధరలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనే బలమైన భావన టాలీవుడ్ ప్రముఖుల్లో ఉంది. అయితే ఈ విషయంపై నాగార్జున స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయి. సినిమా టికెట్ రేట్లతో తనకేం సమస్య లేదని నాగార్జున చెప్పడం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. తాజాగా నాగ చైతన్య ఈ విషయంపై…
కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం…