మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం జగన్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు.
తన ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సత్తెనపల్లే తన నివాసప్రాంతమని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజకీయాలతో సంబంధం లేదన్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నేతలు, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.