Dy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dy CM Narayana Swamy: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ దేశానికి ఏమీ సేవ చేయలేదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలుసుకున్నాడని నారాయణ స్వామి అన్నారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టాడని.. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఒక్కటొయ్యారన్నారు. ఇక్కడ జరిగిందాన్ని వీడియో తీసి పెడితే పవన్ కల్యాణ్, చంద్రబాబు పకపక నవ్వుకునేదన్నారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని.. తాను పూలమాల వేసుకునేందుకు కాదు.. చెప్పు దెబ్బలు తీసుకునే దానికి కూడా తాను రెడీ అన్నారు. తాను తప్పు చేయననని.. ఎవరి దగ్గర డబ్బు తీసుకోనన్నారు.
Read Also: Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు
Also Read
- Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
బుధవారం డిప్యూటీ సీఎంకు కార్వేటినగరంలో నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. ఓ మహిళ తమకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తానన్నారని కాలీ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడింది. ఇక, మా వీధిలో త్రాగునీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. మా వీధిలో మురికి కాలువలో మురికి నీరు అస్తవ్యస్తంగా ఉంది.. ఎవరికీ చెప్పినా పట్టించుకునే వారు లేరన్నా రు.. ఇలా సమస్యలు చెబుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వా మితో హేమలత అనే మహిళ వాగ్వాదానికి దిగింది.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిం ది.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ మహిళ వెనక్కి తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. కాగా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నా రు సీఎం వైఎస్ జగన్.. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్య టించడం .. తాము అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృ ద్ధి గురించి చెప్పడం.. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్ని కలు.. ఇతర కార్యక్రమాలతో కొన్ని రోజులు ఈ కార్యక్రమానికి బ్రేక్లు పడగా.. మళ్లీ నిర్వ హించాలనే ఈ మధ్యే ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!