Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్.. ఆయనది నాలుకా, తాటిమట్టా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.
కొద్దో గొప్పో టీడీపీకి ఉన్న ఉనికి వచ్చే ఎన్నికల్లో పోవడం ఖాయమని బొత్స పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది నాటి సీఎం వైఎస్సార్ హయాంలోనే అన్నది టీడీపీకి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ అభివృద్ధిని సీఎం జగన్ కొనసాగిస్తున్నారన్నారు. సీఎం జగన్పై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. ఆయనది నాలుకా, తాటిమట్టా అంటూ మండిపడ్డారు. రుషికొండ బోడి కొండ చేశారని పదే పదే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అక్కడ ఏమైనా ప్రైవేట్ కట్టడాలు, లేదంటే తాము వ్యక్తిగత కట్టడాలు ఏమైనా చేస్తున్నామా.. ప్రభుత్వ కట్టడాలకే కదా ఉపయోగిస్తోంది…అభివృద్ధి చేయడం తప్పా.. అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అని ప్రశ్నలు గుప్పించారు. పేదవాడి ఆకలి మీద రాజకీయాలు చేసే చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
Also Read
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
Read Also: AP CM Jagan: స్కామ్లు తప్ప.. స్కీమ్లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
దేశంలోనే అత్యధిక జీడీపీ పెరిగిన రాష్ట్రం ఏపీ అని.. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచిన ప్రభుత్వం మాది అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం… ఈ నాలుగు అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ నాలుగు అంశాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు పనైపోయిందని.. గ్రామాల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యం ఆయనకు ఉందా అంటూ బొత్స ఎద్దేవా చేశారు. జనసేన ఓ సెలెబ్రెటీ పార్టీ.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు ఆ పార్టీకి లేవన్నారు. గత ఏడాది జరిగిన పరిణామాలతో …ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పరీక్షలను కూడా రాజకీయాలకు వాడుకుందామనుకుంటే అంతకన్నా నీచమైన పని ఉండదన్నారు.
తాజావార్తలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!