ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుప్పంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సంఘం అధ్యక్షుడు శివ పీసీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, టీడీపీకే పనిచేస్తున్నామని కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే సీఎం ఎన్టీఆర్ అనే…
ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో…
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలి. పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండి. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందన్నారు జగ్గారెడ్డి. టీడీపీ వాళ్ళు కూడా మీ కుటుంబాన్ని అంటే ఎలా ఉంటుంది? ఏపీతో నాక్కూడా…
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నారంటూ సభలోంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుపెట్టుకున్నారు. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనజ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ నేతృత్వంలో…
2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మీద వుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఫ్యాన్ గాలి హవా కొనసాగుతూనే వుంది. తాజాగా సీఎం స్వంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ,…
చంద్రబాబులా కుట్రలు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదన్నారు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ప్రజా బలంతో జగన్ గెలిచారన్నారు. విశాఖ తగరపువలస రెండో రోజు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న అదరణ చూసి ఓర్వలేక తన తొత్తు అయిన పట్టాభితో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారని విమర్శించారు తానేటి వనిత. రాష్ట్రం లో అలజడి,శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని ప్రజాదరణ కోల్పోతున్న తెలుగుదేశం…
సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం వుంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. పార్టీలో ఏ పదవిలో వున్నవారైనా వాయిస్ ఒకటే వుంటుంది. కానీ అదేంటో ఏపీలో బీజేపీలో మాత్రం ఒకే అంశంపై రెండురకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దగ్గర్నించి రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వరకూ వివిధ రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అనేకసార్లు జీవీఎల్, సోము వాయిస్…
రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు దారుణంగా వున్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం..ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి ఆలోచించండి అన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే ఈ చర్యలా.. !? అని గంటా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య…
మన సినిమాల్లో హీరోలు, విలన్లు ఎలాగైతే ఉంటారో.. పురాణాల్లోనూ దేవతలు, రాక్షసులు ఉండేవారు. వీరికి ఒకరంటే ఒకరు పడదు. ఎవరైనా మంచి పని చేస్తే ఇంకొకరికి అసలు నచ్చదు. దీంతో వీరి మధ్య నిత్యం ఫైట్ సీన్లు జరుగుతూనే ఉంటాయి. పురాణాల్లో అయితే దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధాలు జరిగినప్పుడు త్రిమూర్తులు(బ్రహ్మ, విష్ణు, శివుడు) ఏదోరకంగా సర్దిచెప్పేవారు. విన్నారా? ఒకే.. లేకుంటే తమ శక్తులతో అంతమొందించి లోకకల్యాణం చేసేవాళ్లు. మన సినిమాల్లోనూ అంతే. హీరో క్యారెక్టర్…
మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.? అంతా ఏకమయ్యే అజెండాపై ప్రతిపక్షాలు ఫోకస్? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు ఒకే గూటికి…