మూడో రాజకీయశక్తి వస్తుందా? ముద్రగడ వ్యూహమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల శెట్టిబలిజ కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణ, మాల మహానాడు నేత ఆర్.ఎస్.రత్నాకర్ అంతర్గత సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
ఒకవైపు చలి, మరోవైపు ఏపీలో రాజకీయం స్తబ్ధుగా వున్న వేళ ఒక్కసారిగా వేడి రాజుకుంది. కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బీసీ, దళిత సంఘాల నాయకులు కలుసుకున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యమాలకే పరిమితమైన ముద్రగడను ఒక్కసారిగా ఇరు సామాజిక వర్గాల నాయకులు ముద్రగడను ఈయన స్వగృహంలో కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజా చరిష్మా ఉన్న నాయకుడు ముద్రగడను కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
వీరందరి కలయికకు కారణం ఏమై ఉంటుందన్న దానిపై హాట్ టాపిక్ అవుతోంది. ముద్రగడను కలిసేందుకు శెట్టి బలిజ సామాజిక వర్గం నుండి కుడుపూడి సూర్యనారాయణను, దళిత సామాజిక వర్గం నుండి ఆర్.ఎస్ రత్నాకర్ వచ్చారు వీరిరువురిని ఉద్యమ నేత ముద్రగడ ఆప్యాయంగా అక్కున చేర్చుకుని వీరి రాకకు గల కారణాలను తెలుసుకున్నారు. వీరంతా ఓ.సి బి.సి ఎస్.సి కులాలకు చెందిన నాయకులు కావడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఏమైనా పావులు కదుపుతున్నారా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.
ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే అపార రాజకీయ మేధావైన ఉద్యమనేత ముద్రగడను అంత తేలిగ్గా ముగ్గులోకి దింపడo వీరిరువురికీ సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ముద్రగడ నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమావేశం అనంతరం నేతలు మీడియా ముందు వెల్లడించారు. ఈ సమావేశంపై ఇతర పార్టీల నేతలు కూడా కూపీలాగినట్టు సమాచారం.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..