వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిన చంద్రబాబునాయుడు ఆయనతో భేటీ అయ్యారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని కీలక వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా రెక్కీ వివరాలను ఆరా తీశారు చంద్రబాబు. రాధా భద్రతకు గన్ మెన్లను కేటాయించింది ప్రభుత్వం. అయితే వాటిని తిరస్కరించారు రాధా. తాజాగా చంద్రబాబు -రాధా ఇంటికి వెళ్ళడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడలో క్లబ్ దగ్గర ఉన్న వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు చంద్రబాబు. వంగవీటి రాధ హత్యకు జరిగిన…
పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఏడాదికి రూ.18,000వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కేవలం 31లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందేవని, కేవలం జన్మభూమి కమిటీలు సూచించిన వారికి మాత్రమే ఇచ్చేవారని మంత్రి విమర్శించారు. Read Also: నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల నుంచి…
1. దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. 2.రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…
ఏపీలో రాజకీయాల్లో పొత్తులు ప్రారంభం అవుతున్నాయా? ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకు పైగానే సమయం వుంది. అయినా 2014 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయేమో అనిపిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సింహాన్ని ఎదుర్కొనేందుకు ఎన్ని జంతువులు ఏకమైనా ఏం చేయలేవు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయన్నారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రచారం కల్పిస్తూ రాజకీయ లబ్దికోసం ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని తాము…
వైసీపీలో కొందరు నేతలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వుంటారు. అందునా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియానే అన్నారు ఆనం. మాఫియాలు ఈ…
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కి నిర్వహించారని రాధా కామెంట్ చేయడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా వంగవీటి రాధా వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు చంద్రబాబు. రాధా తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత భద్రత…
ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న.…
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ…
ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.…
1. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. 2. రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై…