Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని…
Pulivendula ZPTC By-Election Tensions: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార టీడీపీ, వైసీపీ నాయకులు మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. తాజాగా వైసీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆఫీసులోనే నిర్బంధించారు. ఇది తెలిసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు వాళ్లను పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు,…
Pulivendula: కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ (ఆగస్టు 10న) సాయంత్రం 5గంటలకు తెర పడనుంది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 12న) నాటి పోలింగ్కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.
రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల…
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
Anil Kumar Yadav Mining Case: నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై మైనింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.
టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ రంగాలకు ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళారుపాలా శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు.