అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాలకు సర్వేపల్లి నియోజకవర్గం అగ్నిపరీక్ష కానుంది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేరును టీడీపీ సీరియస్గా పరిశీలిస్తుండగా, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని మళ్లీ నామినేట్ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ ఇస్తే మూడోసారి పోటీ చేస్తానన్నారు. కాకాణి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 2014లో 5,446, 2019 ఎన్నికల్లో 13,973 మెజారిటీతో రెండుసార్లు గెలిచి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. 2022 ఏప్రిల్లో…
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్ధిక గణాంకాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. రాబడులు- వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక ఇచ్చింది.
చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు…
ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది.
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
మూడు సార్లు సీఎంగా చేస్తే, మ్యానిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి(వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ – ఓడీఓపీ)లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులను సీఎం జగన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్-ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు రావడం గమనార్హం.
ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి.
అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. కాగా.. ఈ విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే.. వాసుపల్లి గణేష్ స్పీకర్ సీతారాంను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై పోటీ చేసి గెలిచాను.. తర్వాత టీడీపీ పేద వాళ్ళకు అన్యాయం చేస్తోందని గమనించి పార్టీకి దూరం జరిగానని తెలిపారు. తాను…