Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Chief Chandrababu Fired On Cm Jagan In Guntur District

Chandrababu: జగన్ కుర్చీ మడతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Published Date :March 2, 2024 , 9:06 pm
By Suresh Maddala
Chandrababu: జగన్ కుర్చీ మడతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

జగన్ (CM Jagan) పులివెందుల రాజకీయాలు, పంచాయితీలు చేస్తే కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

ఓడిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని.. జగన్ సీట్లు ఇస్తానంటే కూడా వద్దని నాయకులు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. పల్నాడును అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ-జనసేనల ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

Also Read

  • Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం "అమ్మ"
  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
Add as a preferred
source on google

‘‘పల్నాడులో వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక్క పనైనా చెప్పాలి. రోడ్లు వేశారా, నీళ్లిచ్చారా? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? ఏం చేశారో చెప్పాలి. పల్నాడుకి వస్తే తన మనసు ఆవేదనతో నిండిపోతుంది. పల్నాడులో టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు. స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాద్‌ను మానసికంగా వేధించి ప్రాణాలు తీశారు. ఒక చంద్రయ్య , ఒక జల్లయ్య లాంటి కార్యకర్తల మరణాలను, హత్యలను నేను ఎప్పటికీ మర్చిపోను. రెంటచింతల మండలం మల్లవరంలో ఓ ఎస్టీ మహిళ మంచినీళ్లు అడిగితే టాంకర్‌తో గుద్ది చంపేశారు. ఇలాంటి హత్యలు మర్చిపోతానా..?, ప్రజల ప్రాణాలు పోతుంటే విజ్ఞత లేకుండా.. విచారణ చేయకుండా పాలన చేస్తున్న ముఖ్యమంత్రికి పాలించే హక్కు లేదు. పల్నాడులో నరహంతకుల్ని అణగ దొక్కుతాను అదే నా శపధం. వాళ్లను వదిలేది లేదు. పల్నాడులో ముప్పై మంది ప్రాణాలు తీశారు. వాళ్ళని ఉపేక్షించేది లేదు.’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

‘‘టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు ఇల్లు వదలి పారిపోవాలి. పల్నాడు పరిరక్షణ కోసం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. పిరికితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడాలి. నన్ను బయటకు రానివ్వకుండా… నా ఇంటికి తాళాలు వేసినప్పుడే చెప్పా. ఆ తాళాలు జగన్‌కు ఉరితాడుగా మారిపోతున్నాయి.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఓ నాయకుడు నెల్లూరులో ఒక తన్ను తంతే నాలుగు జిల్లాలు దాటి నరసరావుపేట వచ్చి పడ్డాడు. నరసరావుపేటలో తంతే చెన్నై వెళ్లి పడాలి. అక్కడి నుంచి వచ్చిన నాయకుడికి బుల్లెట్ దిగాలి. జగన్‌కు చావు తెలివితేటలు ఎక్కువై ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌ను అరెస్టు చేయించారు. జగన్ చేసిన నేరాలకు శాశ్వతంగా జైలు శిక్ష పడాలి.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘పల్నాడులో మహిళలు రాణి రుద్రమదేవిలా మేము సైతం యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చారు. టీడీపీ- జనసేనల విజయాన్ని ఎవరు ఆపలేరు. మా విజయాన్ని ఆపాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తున్నారు. దుర్మార్గ పాలన అంతం చేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి చేయలేక ప్రతిపక్షాల మీద దాడులు చేయిపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను తిడితేనే పార్టీలో పదవులు ఉంటాయని వైసీపీ చెబుతోంది.’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • chandrababu
  • cm jagan
  • fired
  • Guntur District

తాజావార్తలు

  • Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions