AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు!
- కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
- రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు
- రెవెన్యూ డివిజన్లు, మండలాలు మార్పులు చేస్తూ నోటిఫికేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వాటర్గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వాటర్గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం (డిసెంబర్ 31) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.
2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా హెడ్ క్వాటర్ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ తుది నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. అలానే పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు సరిహద్దులు మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రేపటి నుంచే సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
Also Read: Sara Arjun History: 20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్కు దక్కని క్రెడిట్ సారా సొంతం!
నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి.. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురానికి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా.. పెనుగొండను వాసవీ పెనుగొడంగా మారుస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కానుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా.. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు జత అవుతున్నాయి. మొత్తంగా 82 రెవెన్యూ డివిజన్లు కానున్నాయి. అడ్డరోడ్డు జంక్షన్, పీలేరు, బనగానపల్లి, మడకశిర, అద్దంకిలు కొత్త రెవెన్యూ డివిజన్లు. 679 ఉన్న మండలాలు రేపటి నుంచి 681 మండలాలు కానున్నాయి. ఆదోని 1, ఆదోని 2 రెండు కొత్త మండలాలు.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!