Minister Nadendla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో నేటి వరకు 2 లక్షల 36 వేల మెట్రిక్ టన్నులు సేకరించాం..
ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఈరోజు ( అక్టోబర్ 4న) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు.
Auto Driver Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో...’ పథకానికి శ్రీకారం చుట్టింది.
Family Benefit Card in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫామిలీ బెనిఫిట్ కార్డ్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డ్ తరహాలోనే బెనిఫిట్ కార్డ్ ఉండనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచనుంది. ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో…
Annadata Sukhibhava: కడప మహానాడులో హామీ ఇచ్చా త్వరలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనుకున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రారంభించాం. 2028 డిసెంబర్ కల్లా ఫేస్ వన్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు..
జులై ప్రారంభం నుంచి జనంలోకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఈ విషయంలో ఇప్పటికే వారికి అధినేత నుంచి ఆదేశాలు అందాయి. అయితే... టీడీపీ నేతలను ఓ డౌట్ బాగా వేధిస్తోందట. అధినేత ఆదేశించినట్టుగానే జనంలోకి వెళ్తాం సరే. వెళ్లి ఏం జనానికి ఏం చెప్పాలి..? సూపర్ సిక్స్లో పెండింగ్లో ఉన్న పథకాల గురించి జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఎలా కన్విన్స్ చేయాలి..? అని లోలోపల మధనపడిపోతున్నారట.
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉండటంతో కార్పొరేషన్లో 410 మంది ఉద్యోగులను తొలగించే విధంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులను తొలగించటానికి నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.