Minister Atchannaidu: ఆ విషయంలో రైతులకు ఆందోళన వద్దు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..
- పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దు
- మిగిలిన పొగాను మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తాం
- రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు
- ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. మామిడి, కోకో పంటల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు.
READ MORE: TMC MP: సీక్రెట్ మ్యారేజ్.. 65 ఏళ్ల పొలిటీషియన్ను పెళ్లి చేసుకున్న 50 ఏళ్ల మహిళా ఎంపీ..
Also Read
మామిడి పంట కొనుగోలుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కోకో విషయంలో కూడా కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పంటల కొనుగోలుకు సంబంధించి, ప్రధానంగా పొగాకు.. మామిడి.. కోకో విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీస్కుంటున్నామని తెలిపారు.
READ MORE: Chevireddy Bhaskar Reddy: మద్యానికి నేను దూరం.. నన్ను లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు..
తాజావార్తలు
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
-
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
-
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
-
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో