Polavaram : రేపు సుప్రీం కోర్టులో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై విచారణ..!
- సుప్రీంకోర్టు విచారణపై ఏపీ ప్రభుత్వం అలర్ట్
- జల హక్కులపై బలమైన వాదనలు
- గోదావరి వరదనీటే ఉపయోగం అన్న స్పష్టం
- రాయలసీమకు నీళ్లతో పచ్చని భవిష్యత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ, రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను , సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఆ ఉప్పునీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (GWDT) అవార్డు నిబంధనల ప్రకారం, మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్ధమైన హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో, ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ప్రాజెక్టు పురోగతిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ రిపోర్ట్ను సమర్పించామని, వారి సూచనల మేరకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన డీపీఆర్ టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్యలు మాత్రమేనని, చట్టపరమైన అన్ని అనుమతులు , క్లియరెన్సులు లభించిన తర్వాతే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో రాష్ట్రం తన వాదనను సమర్థవంతంగా వినిపించి, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేలా లీగల్ టీం అలెర్ట్గా ఉండాలని ఆయన ఆదేశించారు.
Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!