Polavaram : రేపు సుప్రీం కోర్టులో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై విచారణ..!
- సుప్రీంకోర్టు విచారణపై ఏపీ ప్రభుత్వం అలర్ట్
- జల హక్కులపై బలమైన వాదనలు
- గోదావరి వరదనీటే ఉపయోగం అన్న స్పష్టం
- రాయలసీమకు నీళ్లతో పచ్చని భవిష్యత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ, రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను , సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఆ ఉప్పునీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (GWDT) అవార్డు నిబంధనల ప్రకారం, మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్ధమైన హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో, ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- Ambati Rambabu: 'ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు'.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
ప్రాజెక్టు పురోగతిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ రిపోర్ట్ను సమర్పించామని, వారి సూచనల మేరకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన డీపీఆర్ టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్యలు మాత్రమేనని, చట్టపరమైన అన్ని అనుమతులు , క్లియరెన్సులు లభించిన తర్వాతే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో రాష్ట్రం తన వాదనను సమర్థవంతంగా వినిపించి, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేలా లీగల్ టీం అలెర్ట్గా ఉండాలని ఆయన ఆదేశించారు.
Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!