ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అందరూ కూడా టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కొలికపూడి కోరారు.
సూపర్ 6.. సూపర్ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాబా అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలతో పాటు.. తెలంగాణలో లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నంది ఎన్నికల కమిషన్.. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా.. ఈ రోజు ఇవాళ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు కావడంతో.. ఇంకా ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు.. కొన్నిస్థానాల్లో రెబల్స్ నామినేషన్స్ వేయడంతో.. వారి ఉపసంహరించుకుంటారా? లేదా కొనసాగుతారా? బరిలో నిలిచే స్వతంత్రులు ఎంతమంది.. వెనక్కి తగ్గేవారు ఎవరు? ఇవాళ్టితో తేలిపోనుంది.
ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
జనసేన పార్టీకి కామన్ సింబల్గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా.
జగన్ను, వైసీపీని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు. పాలసీ పరంగానే విమర్శలు చేశానన్నారు. విజయవాడ అభివృద్ధి నా అజెండా అని ఆయన పేర్కొన్నారు.